team india: చరిత్ర సృష్టించిన టీమిండియా..

ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి సిరీస్ కైవసం... 3-1తో సిరీస్ వశం చేసుకున్న మహిళల జట్టు;

Update: 2025-07-10 09:00 GMT

భారత మహిళల జట్టు అద్భుతం చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఇంగ్లీష్ జట్టును సొంత గడ్డపై ఓడించి సిరీస్‌ దక్కించుకుంది. ఇంగ్లండ్‌లో టీ20 అంతర్జాతీయ సిరీస్‌ను టీమిండియా మహిళల జట్టు గెలవడం ఇదే తొలిసారి. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో జట్టు సాధించిన ఈ విజయం చాలా సంవత్సరాలు గుర్తుంటుంది.

నాలుగో టీ20లో..

భా­ర­త్, ఇం­గ్లం­డ్ మహి­ళల జట్లు 5 టీ20 మ్యా­చ్‌ల సి­రీ­స్ ఆడు­తు­న్న సం­గ­తి తె­లి­సిం­దే. భారత జట్టు ఇం­గ్లాం­డ్‌­పై 3-1 తే­డా­తో మ్యా­చ్ మి­గి­లి ఉం­డ­గా­నే టీ20 సి­రీ­స్‌­ను కై­వ­సం చే­సు­కుం­ది. టీ20 సి­రీ­స్‌­లో భా­గం­గా ఓల్డ్ ట్రా­ఫో­ర్డ్ క్రి­కె­ట్ మై­దా­నం­లో నా­లు­గో టీ20లో ఇం­గ్లాం­డ్ జట్టు­పై 6 వి­కె­ట్ల తే­డా­తో వి­జ­యం సా­ధిం­చిం­ది. ముం­దు­గా బ్యా­టిం­గ్ చే­సిన ఇం­గ్లాం­డ్.. భారత బౌ­ల­ర్ల ధా­టి­కి 7 వి­కె­ట్లు కో­ల్పో­యి 126 పరు­గు­లు­చే­సిం­ది. ఇం­గ్లాం­డ్ బ్యా­ట­ర్ల­లో సో­ఫి­యా డం­క్లీ 22 పరు­గు­లు చేసి టా­ప్‌ స్కో­ర­ర్‌­‌­గా ని­లి­చిం­ది. భారత బౌ­ల­ర్ల­లో రాధా యా­ద­వ్, శ్రీ­చ­ర­ణి 2 వి­కె­ట్లు, అమ­న్‌­జో­త్ కౌర్, దీ­ప్తి శర్మ చెరో వి­కె­ట్ పడ­గొ­ట్టా­రు. అనం­త­రం లక్ష్య ఛే­ద­న­కు ది­గిన భారత జట్టు 17 ఓవ­ర్ల­లో­నే 4 వి­కె­ట్లు కో­ల్పో­యి 127 పరు­గుల లక్ష్యా­న్ని ఛే­దిం­చిం­ది. భారత బ్యా­ట­ర్ల­లో స్మృ­తి మం­ధాన (32), షఫా­లీ వర్మ (31), జె­మీ­మా రో­డ్రి­గ్స్ (24*), హర్మ­న్ ప్రీ­త్ కౌర్ (26) రా­ణిం­చా­రు. అద్భు­త­మైన బౌ­లిం­గ్ ప్ర­ద­ర్శన చే­సిన రాధా యా­ద­వ్‌­కు ప్లే­య­ర్ ఆఫ్ ది మ్యా­చ్ టై­టి­ల్ లభిం­చిం­ది. 4 ఓవ­ర్ల­లో కే­వ­లం 15 పరు­గు­లు ఇచ్చి 2 వి­కె­ట్లు పడ­గొ­ట్టిం­ది రాధా. మొ­ద­టి రెం­డు టీ20లలో ఇం­గ్లం­డ్ జట్టు­ను ఓడిం­చిన టీ­మిం­డి­యా.. మూడో టీ2లో ఇం­గ్లం­డ్‌ చే­తి­లో ఓడిం­ది. నా­లు­గో మ్యా­చ్‌­లో భారత మహి­ళ­లు అద్భుత ప్ర­ద­ర్శన చేసి వి­జ­యం సా­ధిం­చి సి­రీ­స్ కై­వ­సం చే­సు­కుం­ది. సి­రీ­స్‌­లో మరో మ్యా­చ్ మి­గి­లి ఉంది.

Tags:    

Similar News