ఒలింపిక్స్లో మరో విజయం సాధించిన భారత హాకీ జట్టు
Tokyo olympics 2021:ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది.;
హాకీ ఫైల్ ఫోటో
ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పూల్ ఏలో అర్జెంటీనాతో తలపడ్డ మ్యాచులో భారత జట్టు 3-1 తేడాతో విజయాన్ని సాధించింది. మూడవ క్వార్టర్ చివరి వరకు ఇరు జట్లు ఒక్క గోల్ కూడా సాధించలేదు. అయితే మ్యాచ్లో 43వ నిమిషంలో భారత ఆటగాడు కుమార్ వరుణ్ తొలి గోల్ చేయగా.. అనంతరం అర్జెంటీనా కూడా గోల్ సాధించి స్కోర్ ఈక్వల్ చేసింది. అయితే 58వ నిమిషంలో ప్రసాద్ వివేక్సాగర్, 59వ నిమిషంలో హర్మన్ప్రీత్ సింగ్ గోల్ చేయడంతో 3-1 తేడాతో అర్జెంటీనాపై ఘన విజయం సాధించింది.