మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ని ఐసీసీ విడుదల చేసింది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ పొట్టి కప్ జరగనుంది. మలేషియా వేదికగా ఈ టోర్ని జరగనుంది. మొత్తం 41 మ్యాచ్లు నిర్వహించనున్నారు. 16 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. ప్రతి గ్రూప్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. సూపర్ సిక్స్లోని రెండు గ్రూప్ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్కు చేరతాయి. గ్రూప్ ఎలో భారత్, వెస్టిండీస్, శ్రీలంక, మలేసియా, గ్రూప్ బిలో ఇంగ్లాండ్, పాకిస్థాన్, ఐర్లాండ్, యూఎస్ఏ, గ్రూప్ సిలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్రికా క్వాలిఫయర్, సమోవా, గ్రూప్ డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆసియా క్వాలిఫయర్, స్కాట్లాండ్ ఉన్నాయి.
గ్రూప్ దశలో టీమిండియా జనవరి 19న వెస్టిండీస్, 21న మలేసియా, జనవరి 23న శ్రీలంకతో తలపడనుంది. భారత్ సెమీ ఫైనల్స్కు వెళ్తే జనవరి 31న రెండో సెమీ ఫైనల్ ఆడుతుంది. సెమీ ఫైనల్ మ్యాచ్లకు ఫిబ్రవరి 1, ఫైనల్కు ఫిబ్రవరి 3 రిజర్వ్ డేగా ఉంటాయి. ఈ టోర్నీలో మలేసియా, సమోవా తొలిసారి పోటీపడనున్నాయి. జనవరి 13 నుంచి 16 వరకు వార్మప్ మ్యాచులు నిర్వహించనున్నారు. అండర్-19 స్థాయిలో ఇది రెండో టీ20 ప్రపంచకప్. 2023లో తొలిసారిగా నిర్వహించిన ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఇంగ్లాండ్పై ఏడు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.