దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సామన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరినీ ఈ మహమ్మారి వదలటం లేదు. తాజగా భారత మహిళా రెజ్లర్ కరోనా బారిన పడ్డారు. రెజ్లర్ వినేశ్ ఫోగట్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని వినేశ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించారు ఫోగట్. ఈ సంవత్సరం ఖేల్ రత్నా అవార్డుకు ఎంపికైన వారిలో వినేశ్ ఫోగట్ కూడా ఉన్నారు.