IND vs ENG: ఇక భారమంతా బౌలర్లపైనే

విజయానికి 324 రన్స్ దూరంలో ఇంగ్లాండ్.. ఎనిమిది వికెట్ల దూరంలో టీమిండియా.. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 50/1;

Update: 2025-08-03 03:00 GMT

ఇంగ్లాండ్, భారత్‌ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రసవత్తరంగా మారింది. విజయానికి ఇరు జట్లు సమాన దూరంలో నిలిచాయి. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలోనే 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఇంగ్లిష్‌ జట్టు.. ఆట ముగిసే సమయానికి 50/1తో నిలిచింది. జాక్ క్రాలీ (14)ని సిరాజ్ ఔట్ చేశాడు. బెన్ డకెట్ (34*) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 324 పరుగులు అవసరం. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224, ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌటయ్యాయి. రెండో ఇన్నింగ్స్‌లో 75/2తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్.. 396 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (118; 164 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకం (ఓవర్‌నైట్ 51) బాదాడు. ఆకాశ్ దీప్ (66; 94 బంతుల్లో 12 ఫోర్లు) అర్ధ శతకంతో (ఓవర్‌నైట్ 4)ఆకట్టుకున్నాడు. రవీంద్ర జడేజా (53; 77 బంతుల్లో 5 ఫోర్లు) కూడా హాఫ్‌ సెంచరీ చేశాడు. ధ్రువ్ జురెల్ (34; 46 బంతుల్లో) పర్వాలేదనిపించాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (53; 46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ప్రసిద్ధ్‌ కృష్ణతో కలిసి సుందర్ పదో వికెట్‌కు 39 పరుగులు (25 బంతుల్లో) జోడించడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(5/125) ఐదు వికెట్ల ఘనతను అందుకోగా.. గస్ అట్కిన్సన్(3/127) మూడు వికెట్లు పడగొట్టాడు. జెమీ ఓవర్టన్(2/98) రెండు వికెట్లు తీసాడు. చివర్లో దూకుడుగా ఆడి విలువైన హాఫ్ సెంచరీతో సుందర్ మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పాడు. దాంతో ఇంగ్లండ్‌ ముందు 374 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.

భారమంతా బౌలర్లపైనే

అనం­త­రం బ్యా­టిం­గ్‌­కు ది­గిన ఇం­గ్లం­డ్ 13.5 ఓవ­ర్ల­లో వి­కె­ట్ నష్టా­ని­కి 50 పరు­గు­లు చే­సిం­ది. క్రీ­జు­లో బెన్ డకె­ట్(34 బ్యా­టిం­గ్) ఉం­డ­గా.. జాక్ క్రా­లీ(14)ని సి­రా­జ్ క్లీ­న్ బౌ­ల్డ్ చే­శా­డు. ఇం­గ్లం­డ్ వి­జ­యా­ని­కి 324 పరు­గుల అవ­స­రం కాగా.. మరో 8 వి­కె­ట్లు తీ­స్తే భారత వి­జ­యం లాం­ఛ­న­మ­వు­తోం­ది. ఈ మ్యా­చ్‌­లో వి­జ­యం సా­ధి­స్తే ఐదు టె­స్ట్‌ల అం­డ­ర్స­న్-సచి­న్ ట్రో­ఫీ డ్రా అవు­తుం­ది. భారత బౌ­ల­ర్ల­పై­నే వి­జ­య­వ­కా­శా­లు ఆధా­ర­ప­డి ఉన్నా­యి.

 జైస్వాల్ సెంచరీ..

రెం­డో సె­ష­న్ ఆరం­భం­లో­నే శు­భ్‌­మ­న్ గి­ల్‌­ను గస్ అట్కి­న్స­న్ వి­కె­ట్ల ముం­దు బో­ల్తా కొ­ట్టిం­చా­డు. క్రీ­జు­లో­కి కరు­ణ్ నా­య­ర్ రాగా.. అట్కి­న్స­న్ బౌ­లిం­గ్‌­లో యశ­స్వి జై­స్వా­ల్ సిం­గి­ల్ తీసి 127 బం­తు­ల్లో సెం­చ­రీ పూ­ర్తి చే­సు­కు­న్నా­డు. ఆ కా­సే­ప­టి­కే కరు­ణ్ నా­య­ర్(17)ను అట్కి­న్స­న్ ఎల్బీ­గా పె­వి­లి­య­న్ చే­ర్చా­డు. జడే­జా­తో కలి­సి యశ­స్వి జై­స్వా­ల్ ఇన్నిం­గ్స్‌­ను ముం­దు­కు నడి­పిం­చా­డు. భారీ షాట్ ఆడే ప్ర­య­త్నం­లో జోష్ టంగ్ బౌ­లిం­గ్‌­లో యశ­స్వి జై­స్వా­ల్ క్యా­చ్ ఔట్‌­గా వె­ను­ది­రి­గా­డు. ధ్రు­వ్ జు­రె­ల్‌­తో కలి­సి జడే­జా ఇన్నిం­గ్స్‌­ను ముం­దు­కు నడి­పిం­చా­డు. ఆఖరి సె­ష­న్‌­‌­లో­నూ ఈ జోడీ సా­ధి­క­రిం­గా బ్యా­టిం­గ్ చే­సిం­ది. ఏడో వి­కె­ట్‌­కు 50 పరు­గు­లు జో­డిం­చిం­ది. అయి­తే ప్ర­మా­ద­క­రం­గా మా­రిన ఈ జో­డీ­ని ఓవ­ర్ట­న్ వి­డ­దీ­సా­డు. ధ్రు­వ్ జు­రె­ల్‌­ను ఎల్బీ­గా పె­వి­లి­య­న్ చే­ర్చా­డు. క్రీ­జు­లో­కి సుం­ద­ర్ రాగా.. జడే­జా 71 బం­తు­ల్లో హాఫ్ సెం­చ­రీ పూ­ర్తి చే­సు­కు­న్నా­డు. సుందర్ ఔట్ కావడంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది.

Tags:    

Similar News