125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని రేపు ఆవిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అంబేడ్కర్ వాదులు తరలివస్తారని చెప్పారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బ్యాండ్ లైన్, షేర్ గెట్లో దాదాపు 500మంది నిరుపేద ముస్లింలకు రంజాన్ తో ఫాకిట్లు అందించిన దానం నాగేందర్.. దేశంలో ఎక్కడా లేని విధంగా భారత రాజ్యాంగం నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇక తన నియోజకవర్గంలో ఇలాంటి చరిత్రక కట్టడం రావడం సంతోషంగా ఉందన్నారు.