Harish Rao : ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి 18 కోట్ల నిధులను కేటాయించాం..!
Harish Rao : కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రల బలోపేతానికి 18 కోట్ల నిధులను కేటాయించామన్నారు మంత్రి హరీష్రావు.
Harish Rao : కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రల బలోపేతానికి 18 కోట్ల నిధులను కేటాయించామన్నారు మంత్రి హరీష్రావు. నిలోఫర్ ఆసుపత్రిలో కోటి పది లక్షలతో ఓపెన్ టెక్ట్స్ నుంచి ఐసీయును అప్డేట్ చేశామని స్పష్టం చేశారు. వైద్య సదుపాయల కోసం 10 వేల కోట్లు కేటాయించామన్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కేసీఆర్ కిట్ వచ్చాక.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో30 శాతం ఉన్న డెలివరీ రేట్ను 50 శాతానికి పెంచామన్నారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే సంకల్పంతో కృషి చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు.