Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 27 మంది మృతి..!

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అంక్షలు అమల్లో ఉన్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.;

Update: 2021-05-18 13:43 GMT

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అంక్షలు అమల్లో ఉన్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 71,616 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 3,982 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 27 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇక కరోనా నుంచి 5,186 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.56శాతంగా నమోదవ్వగా.. రికవరీ రేటు 90.47 శాతంగా ఉంది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 48,110 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 607 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. 

Tags:    

Similar News