తెలంగాణలో కొత్తగా 4,009 కేసులు.. 14 మరణాలు..!

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 4వేల9 కేసులు నమోదుకాగా.. 14 మరణాలు సంభవించాయి.

Update: 2021-04-19 06:15 GMT

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 4వేల9 కేసులు నమోదుకాగా.. 14 మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3లక్షల55వేల 433కి చేరింది. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 1838 నమోదయ్యాయి. ప్రస్తుతం 39వేల154 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 705, మేడ్చల్ జిల్లా 363, నిజామాబాద్ జిల్లా 360, రంగారెడ్డి 336, సంగారెడ్డి 264, జగిత్యాలలో 175 కరోనా కేసులు వచ్చాయి.

Tags:    

Similar News