Nizamabad: జువైనల్ హోమ్ నుంచి బాల నేరస్తులు పరారీ.. ఆ అయిదుగురి కోసం గాలింపు..
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో జువైనల్ హోమ్ నుంచి బాల నేరస్తులు పరారైన ఘటన సంచలనం రేపుతోంది.;
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో జువైనల్ హోమ్ నుంచి బాల నేరస్తులు పరారైన ఘటన సంచలనం రేపుతోంది. పరారైన ఐదుగురు పిల్లల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ ఐదుగురు పిల్లలు ఆదిలాబాద్, జగిత్యాలకు చెందినవారీగా అధికారులు చెప్తున్నారు. ఓ బాలుడు దాదాపు 5 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. సిబ్బంది నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు.