తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ 20 వేల 761 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో అతిపెద్ద ఎఫ్డీఐ ఇన్వెస్టిమెంట్ ఇదేనంటూ ట్వీట్ చేశారు. 2022 నాటికి తెలంగాణలో మల్టిపుల్ డేటా సెంటర్లు వస్తాయని ఆయన వెల్లడించారు.