ASSEMBLY: సీబీఐ చేతికి "కాళేశ్వరం ప్రాజెక్టు"

తెలంగాణ శాసనసభ సంచలన నిర్ణయం.. కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ శాసనసభ నిర్ణయం.. రీడిజైన్‌ పేరుతో కేసీఆర్‌ రూ.లక్ష కోట్లు కొల్లగొట్టారన్న సీఎం.. అర్ధరాత్రి దాటాకా సాగిన సభ

Update: 2025-09-01 02:30 GMT

కా­ళే­శ్వ­రం ని­వే­ది­క­ను తె­లం­గాణ ప్ర­భు­త్వం శా­స­న­స­భ­లో ప్ర­వే­శ­పె­ట్టిం­ది. ఈ ప్రా­జె­క్టు­లో లో­పా­లు­న్నా­య­ని జస్టి­స్ పీసీ ఘోష్ కమి­ష­న్ తే­ల్చిం­ది. ప్లా­నిం­గ్, డి­జై­న్, ని­ర్మా­ణం­లో లో­పా­లు ఉన్నా­య­ని ని­వే­ది­క­లో వె­ల్ల­డిం­చిం­ది. ఆర్థిక క్ర­మ­శి­క్షణ లే­కుం­డా ని­ర్మా­ణం జరి­గిం­ద­ని. మె­యిం­టె­నె­న్స్ లే­క­పో­వ­డం వల్లే మూడు బ్యా­రే­జీ­ల­లో భా­రీ­గా డ్యా­మే­జ్ జరి­గిం­ద­ని తె­లి­పిం­ది. దీ­ని­పై అసెం­బ్లీ­లో వా­డి­వే­డి చర్చ జరి­గిం­ది. కా­ళే­శ్వ­రం కమి­ష­న్ ని­వే­ది­క­పై ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి శా­స­న­స­భ­లో కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. కా­ళే­శ్వ­రం బ్యా­రే­జీ­ల్లో అక్ర­మా­లు, వై­ఫ­ల్యా­ల­పై మరింత లో­తు­గా దర్యా­ప్తు చే­య­డా­ని­కి సీ­బీ­ఐ­కి కేసు అప్ప­గిం­చా­ల­ని శా­స­న­సభ ని­ర్ణ­యిం­చిం­ది. ఆది­వా­రం శా­స­న­స­భ­లో జస్టి­స్‌ పీసీ ఘో­ష్‌ కమి­ష­న్‌ ని­వే­ది­క­పై జరి­గిన చర్చ­కు సమా­ధా­న­మి­చ్చిన ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి ఈ ని­ర్ణ­యా­న్ని ప్ర­క­టిం­చా­రు. కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు ని­ర్మా­ణం­లో అం­త­ర్రా­ష్ట్ర ప్ర­భు­త్వా­లు, కేం­ద్ర ప్ర­భు­త్వ సం­స్థ­లైన ఆర్‌­ఈ­సీ, పీ­ఎ­ఫ్‌­సీ భా­గ­స్వా­మ్య­మై ఉన్నా­య­ని.. అం­దు­కే కే­సు­ను సీ­బీ­ఐ­కి అప్ప­గిం­చ­డం సము­చి­త­మ­ని శా­స­న­సభ భా­వి­స్తోం­ద­ని రే­వం­త్‌­రె­డ్డి చె­ప్పా­రు. తె­లం­గాణ ప్ర­జల సొ­మ్ము రూ.లక్ష కో­ట్ల­ను దో­చు­కు­నేం­దు­కే కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు కట్టా­ర­ని మం­డి­ప­డ్డా­రు. ఆనా­డు మహా­రా­ష్ట్ర­తో చర్చ జరి­గిం­ది కే­వ­లం ప్రా­జె­క్టు ఎత్తు గు­రిం­చే అని గు­ర్తు­చే­శా­రు. కా­వా­ల­నే హరీ­ష్ రావు పదే పదే తప్పు­డు సమా­చా­రం ఇస్తు­న్నా­ర­ని అన్నా­రు. తు­మ్మి­డి­హ­ట్టి వద్ద నీ­ళ్లు ఉన్నా­య­ని చె­ప్పి­నా మీ­రెం­దు­కు వి­న­లే­ద­ని బీ­ఆ­ర్ఎ­స్ నే­త­ల­ను ప్ర­శ్నిం­చా­రు. తు­మ్మి­డి­హ­ట్టి దగ్గర ప్రా­జె­క్టు­కు మహా­రా­ష్ట్ర అభ్యం­త­రం చె­ప్ప­లే­దు. లక్ష కో­ట్లు కొ­ల్ల­గొ­ట్టా­ల­ని ప్ర­ణా­ళిక వే­సు­కు­న్నా­రు. పొ­గ­తా­గ­డం ఆరో­గ్యా­ని­కి హా­ని­క­రం అని రా­సి­న­ట్లే.. ప్రా­జె­క్టు కడి­తే హా­ని­క­రం, ని­రు­ప­యో­గం అని అధి­కా­రు­లు పదే పదే చె­ప్పా­రు.

సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు

శా­స­న­స­భ­లో కా­ళే­శ్వ­రం కమి­ష­న్‌­పై చర్చ మొ­ద­లైం­ది. సభలో మాజీ మం­త్రి, బీ­ఆ­ర్ఎ­స్ ఎమ్మె­ల్యే హరీ­ష్ రావు మా­ట్లా­డిన దా­ని­పై సీఎం రే­వం­త్ రె­డ్డి స్పం­దిం­చా­రు. ఈసం­ద­ర్భం­గా ఆయన మా­ట్లా­డు­తూ.. అసం­పూ­ర్తి సమా­చా­రం­తో హరీ­ష్ రావు తె­లం­గాణ సమా­జా­న్ని తప్పు­దోవ పట్టిం­చా­ల­ని ప్ర­య­త్ని­స్తు­న్నా­ర­ని అన్నా­రు. ఆనా­డు మం­త్రి­గా ఉన్న హరీ­ష్ రావు ఈనా­టి­కీ మం­త్రి­గా ఉన్న­ట్లు­గా­నే భా­వి­స్తు­న్నా­ర­ని అన్నా­రు.

హరీశ్‌రావు ఆగ్రహం

బీ­ఆ­ర్ఎ­స్ ఎమ్మె­ల్యే హరీ­ష్‌­రా­వు­కు అసెం­బ్లీ స్పీ­క­ర్‌ అవ­కా­శం ఇచ్చా­రు. అర­గం­ట­లో సమా­ధా­నం చె­ప్పా­ల­ని అవ­కా­శ­మి­చ్చా­రు. దీం­తో స్పీ­క­ర్‌­పై హరీ­ష్ రావు ఫైర్ అయ్యా­రు. 600 పే­జీల ని­వే­ది­క­పై అర­గం­ట­లో ఎలా సమా­ధా­నం చె­బు­తా­ర­ని ప్ర­శ్నిం­చా­రు. కనీ­సం రెం­డు గం­ట­లు సమయం కా­వా­ల­ని అడి­గా­రు. తాము వె­న­క­డు­గు వే­య­బో­మ­ని.. ఎన్ని రో­జు­లై­నా కా­ళే­శ్వ­రం­పై చర్చిం­చేం­దు­కు సి­ద్ధ­మ­ని ప్ర­క­టిం­చా­రు. ప్ర­భు­త్వం నడ­ప­టం చే­త­గాక.. సర్క­స్ చే­స్తు­న్నా­ర­ని హరీ­ష్ రావు సీ­రి­య­స్ అయ్యా­రు.

Tags:    

Similar News