ASSEMBLY:" లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నాలుగేళ్లలోనే కూలింది"

బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్‌

Update: 2025-09-01 03:30 GMT

బీ­ఆ­ర్ఎ­స్ నే­త­ల­పై మం­త్రి ఉత్త­మ్ కు­మా­ర్ రె­డ్డి తీ­వ్ర వ్యా­ఖ్య­లు చే­శా­రు. అసెం­బ్లీ­లో కా­ళే­శ్వ­రం ని­వే­ది­క­పై చర్చ­ను ప్రా­రం­భిం­చిన ఉత్త­మ్‌.. బీ­ఆ­ర్ఎ­స్‌ నే­త­ల­పై మం­డి­ప­డ్డా­రు. తె­లం­గాణ ఏర్ప­డ్డాక అతి­పె­ద్ద ప్రా­జె­క్టు­గా కా­ళే­శ్వ­రం­ను మొ­ద­లు­పె­ట్టా­రు. రూ.87,449 కో­ట్ల­తో ని­ర్మా­ణం చే­ప­ట్టా­రు. కట్టిన కొ­న్ని నె­ల­ల­కే ప్రా­జె­క్టు­కు గుం­డె­కాయ అయిన మే­డి­గ­డ్డ కుం­గిం­ది. రూ.21 వేల కో­ట్ల­తో మే­డి­గ­డ్డ, సుం­ది­ళ్ల, అన్నా­రం బ్యా­రే­జీ­లు కట్టా­రు. 20 నె­ల­లు­గా మే­డి­గ­డ్డ, సుం­ది­ళ్ల, అన్నా­రం బ్యా­రే­జీ­లు ని­రు­ప­యో­గం­గా ఉన్నా­యి. తాము ప్రా­ణ­హి­త­పై 2014 నా­టి­కే రూ.10 వేల కో­ట్ల­కు పైగా ఖర్చు చే­శా­మ­ని మం­త్రి ఉత్త­మ్‌ వె­ల్ల­డిం­చా­రు. వా­ప్కో­స్‌ రి­పో­ర్ట్‌ కంటే ముం­దే మే­డి­గ­డ్డ దగ్గర బ్యా­రే­జీ కట్టా­ల­ని అప్ప­టి ప్ర­భు­త్వం డి­సై­డ­య్యిం­ది. వా­ప్కో­స్‌ రి­పో­ర్ట్‌ ఇచ్చి­న­రో­జే మే­డి­గ­డ్డ దగ్గర బ్యా­రే­జీ ని­ర్మిం­చా­ల­ని ఆదే­శిం­చిం­ది.

అతి­పె­ద్ద ప్రా­జె­క్టు­గా కా­ళే­శ్వ­రం పను­ల­ను కే­సీ­ఆ­ర్ ప్ర­భు­త్వం ప్రా­రం­భిం­చిం­ద­ని గు­ర్తు­చే­శా­రు. తె­లం­గా­ణ­కు ఇది చాలా బా­ధా­క­ర­మైన రోజు అని అభి­ప్రా­య­ప­డ్డా­రు. ప్రా­ణ­హిత - చే­వె­ళ్ల కట్టా­ల­ని 2013లో అప్ప­టి కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం ని­ర్ణ­యం తీ­సు­కుం­ద­ని గు­ర్తు­చే­శా­రు. ప్రా­ణ­హిత - చే­వె­ళ్ల­పై 2014 నా­టి­కే రూ.11,600 కో­ట్ల­ను అప్ప­టి ప్ర­భు­త్వం ఖర్చు చే­సిం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. మే­డి­గ­డ్డ దగ్గర ప్రా­జె­క్టు సరి­కా­ద­ని నాటి ప్ర­భు­త్వ కమి­టీ చె­ప్పిం­ద­ని వి­వ­రిం­చా­రు. మం­త్రి ఉత్త­మ్‌ ప్ర­సం­గా­ని­కి అడు­గ­డు­గు­నా బీ­ఆ­ర్ఎ­స్ నే­త­లు అడ్డు­ప­డా­రు.

బీసీ వర్గాల చారిత్రాత్మక విజయం: సీతక్క

బిసీ బి­ల్లు­కు రా­ష్ట్ర అసెం­బ్లీ ఆమో­దం తె­లి­పిన సం­గ­తి తె­లి­సిం­దే. దీ­ని­పై మం­త్రి సీ­త­క్క కీలక ట్వీ­ట్ చే­శా­రు. 'మా నా­య­కు­డు రా­హు­ల్ గాం­ధీ సూచన మే­ర­కు సీఎం రే­వం­త్ రె­డ్డి క్రి­యా­శీల నా­య­క­త్వం­లో.. పం­చా­య­తీ రాజ్ సవరణ బి­ల్లు-2025ను ప్ర­వే­శ­పె­ట్టాం. ఈ బి­ల్లు కే­వ­లం రి­జ­ర్వే­ష­న్ల గు­రిం­చి మా­త్ర­మే కాదు. ఇది బీ­సీ­ల­కు సా­ధి­కా­రత కల్పిం­చ­డం, వారి గొం­తు­క­ను వి­ని­పిం­చ­డా­ని­కి వి­ప్ల­వా­త్మ­క­మైన అడు­గు.' అని రా­సు­కొ­చ్చా­రు. మన ప్ర­జా ప్ర­భు­త్వం బి­సిల వె­ను­క­బా­టు­త­నా­న్ని అం­చ­నా వే­య­డా­ని­కి ఇం­టిం­టి­కీ సమ­గ్ర కు­టుంబ సర్వే, శా­స్త్రీయ కుల గణ­న­ను ని­ర్వ­హిం­చిం­ది. అం­కి­త­మైన కమి­ష­న్ సి­ఫా­ర్సుల ఆధా­రం­గా, బి­సి­ల­కు 42% రి­జ­ర్వే­ష­న్లు అం­దిం­చ­డా­ని­కి మేము తె­లం­గాణ పం­చా­య­తీ రాజ్ చట్టం, 2018 లోని సె­క్ష­న్ 285A ని సవ­రిం­చా­ము. ఈ బి­ల్లు­కు అసెం­బ్లీ ఆమో­దం తె­ల­ప­డం బీసీ వర్గా­ల­కు ఇది చా­రి­త్రా­త్మక వి­జ­యం" అంటూ సీ­త­క్కలో రా­సు­కొ­చ్చా­రు.

Tags:    

Similar News