Bandi Sanjay : డీజీపీకి బండి సంజయ్ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?

Bandi Sanjay : దేవరుప్పల ఘటనపై డీజీపీతో ఫోన్లో మాట్లాడారు బండి సంజయ్‌.

Update: 2022-08-15 10:00 GMT

Bandi Sanjay : దేవరుప్పల ఘటనపై డీజీపీతో ఫోన్లో మాట్లాడారు బండి సంజయ్‌. లా అండ్‌ ఆర్డర్‌ చేతకాని సీపీ ఇంట్లో కూర్చోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల తలలు పగలగొడుతుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.పోలీసులకు జీతాలు కేసీఆర్‌ జేబుల్లోంచి ఇస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ ఉండేది ఇంకో ఆరు నెలలే అన్నారు. తక్షణమే పాదయాత్ర ప్రశాంతంగా కొనసాగాలే చూడండన్నారు. లేకపోతే.. జరిగే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వెంటనే సీపీ స్పందించాలని లేనిపక్షంలో.. గాయపడ్డ కార్యకర్తల్ని తీసుకుని మీ వద్దకు వస్తానంటూ... డీజీపీకి చెప్పారు బండి సంజయ్‌.

Tags:    

Similar News