Bandi sanjay: కేసీఆర్ను జైలుకు పంపే బాధ్యత బీజేపీదే: బండి సంజయ్
కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఫోటోలు పెట్టుకుని కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.
కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఫోటోలు పెట్టుకుని కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్ర నిధులతో ఎన్ని పథకాలు అమలవుతున్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్లో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్.. కేసీఆర్ను జైలుకు పంపే బాధ్యత బీజేపీదేనన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రగతి భవన్ నుంచి బయటకు పంపిస్తానని ఆయన హెచ్చరించారు.