Bandi Sanjay : బీజేపీ మద్దతు ఇస్తేనే తెలంగాణ వచ్చింది : బండి సంజయ్

Bandi Sanjay : బీజేపీ మద్దతు ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

Update: 2022-02-09 09:45 GMT
Bandi Sanjay : బీజేపీ మద్దతు ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పార్లమెంట్‌లో బిల్లు పెట్టినప్పుడు ఓటింగ్‌లో KCR ఎందుకు పాల్గొనలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్‌కు ఇష్టం లేదన్నారు. కేబినెట్‌లో ఎంత మంది ఉద్యమకారులున్నారో చెప్పాలన్నారు. తెలంగాణను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణను సమర్థించిన పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు కేసీఆర్ ఎందుకు ఒప్పుకున్నారో చెప్పాలన్నారు. కేసీఆర్ పాలనలో ఆర్టీసీ కార్మికులు,రైతులు,నిరుద్యోగులు, ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మండిపడ్డారు.
Tags:    

Similar News