టీఆర్ఎస్ తుగ్లక్ పార్టీ, ఎంఐఎం ఓ తాలిబన్ పార్టీ : సంజయ్
హుజురాబాద్ ఉప ఎన్నికలు వచ్చాయనే సర్కార్ దళిత బంధు ప్రకటించిందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలు వచ్చాయనే సర్కార్ దళిత బంధు ప్రకటించిందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఓ తుగ్లక్ పార్టీ అన్న సంజయ్.. ఎంఐఎం ఓ తాలిబన్ పార్టీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతిలకు రాని సీఎం కేసీఆర్ను దళిత సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఇక కేసీఆర్ ఢిల్లీలో ఉన్నా.. ఇక్కడ ఉన్నా చేసిందేమీ లేదన్నారు.