Bandi sanjay : నా దీక్షకు భయపడే కేటీఆర్‌ బహిరంగ లేఖ విడుదల చేశారు : బండి సంజయ్‌

Bandi Sanjay :నిరుద్యోగ దీక్ష నిర్వహించి తీరుతానని స్పష్టం చేశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌.

Update: 2021-12-26 11:14 GMT

Bandi Sanjay (tv5news.in)

Bandi Sanjay :నిరుద్యోగ దీక్ష నిర్వహించి తీరుతానని స్పష్టం చేశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌. అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా నిరుద్యోగ దీక్ష ఆగబోదన్నారు. ఇందిరా పార్క్‌ వద్దా? లేక మరోచోటా? అన్న దానిపై త్వరలో క్లారిటీ ఇస్తామని, దీనిపై పార్టీలో సమాలోచనలు చేస్తున్నామని తెలిపారు. తన దీక్షకు భయపడే కేటీఆర్‌ బహిరంగ లేఖ విడుదల చేశారని ఎద్దేవా చేశారు. తన దీక్షకు నిరుద్యోగులు భారీగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆ రిపోర్ట్స్‌ ఉన్నాయి కనుకే ప్రభుత్వం... ఆంక్షలను ఆకస్మికంగా అమలు చేస్తోందని దుయ్యబట్టారు బండి సంజయ్‌.

Tags:    

Similar News