Bandi Sanjay: తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్: బండి సంజయ్
Bandi Sanjay: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే బీజేపీ బహిరంగ సభ చరిత్ర సృష్టిస్తుందన్నారు బండి సంజయ్.
Bandi Sanjay: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే బీజేపీ బహిరంగ సభ చరిత్ర సృష్టిస్తుందన్నారు ఆపార్టీ రాష్ట్రఅధ్యక్షుడు బండిసంజయ్. జులై 3వ తేదీన నిర్వహించే బహిరంగ సభకు పెద్దయెత్తున ప్రజలు రాబోతున్నట్లు ఆయన తెలిపారు. సభకు భూమిపూజ చేసిన బండిసంజయ్ అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. మోదీహాజరు కానున్న ఈ సభకు పదిలక్షల మంది వస్తున్నట్లు ఆయన తెలిపారు. బూత్ స్థాయి కార్యకర్తలు సైతం సభకు రాబోతున్నారన్నారు. బీజేపీనేతలను, కార్యకర్తలను ప్రభుత్వ పెద్దలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
సీఎం కేసీఆర్ చెప్పే మాటలు 2001 నుంచి వింటున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ అన్నారు. రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని భావించామన్నారు. కానీ ఇంతవరకు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది జరుగలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకొని ఉద్యమ కారులకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రైవేటు కంపెనీలు అనేకం వస్తున్నాయని.. లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారని కేటీఆర్ చెపుతున్నారని.. ఈ పెట్టుబడులపై స్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Live from Parade Ground https://t.co/06xJtupOvb
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 26, 2022