Bandi Sanjay : 100 కి.మీ చేరువైన బండిసంజయ్ పాదయాత్ర..!

టీఆర్‌ఎస్ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది.

Update: 2021-09-05 12:45 GMT

టీఆర్‌ఎస్ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. బండిసంజయ్ పాదయాత్ర వందకిలోమీటర్లకు చేరువకానున్నది. కేసీఆర్‌ పాలనలో ప్రజాసమస్యలను ఏమాత్రం పరిష్కారానికి నోచుకోవటం లేదంటూ... తమ దృష్టికి తీసుకొస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. అబద్దాలతోనే టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పబ్బం గడపుతుందని సంజయ్ హుజూరాబాద్‌లో ఓటమి భయంతోనే.. టీఆర్ఎస్ కుంటిసాకులు వెతుకుతోందని బీజేపీ OBC ఛైర్మన్ లక్ష్మణ్‌ ఆరోపించారు.

Tags:    

Similar News