Bandi Sanjay : నాలుగో రోజుకు చేరిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర..!

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ... ప్రజా సంగ్రామ పాదయాత్ర ఇవాళ నాలుగో రోజు కు చేరింది.

Update: 2021-08-31 08:30 GMT

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ... ప్రజా సంగ్రామ పాదయాత్ర ఇవాళ నాలుగో రోజు కు చేరింది. ఇవాళ హిమాయత్‌ నగర్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర మొయినాబాద్‌ చేరుకుంది. ఇవాళ పాదయాత్ర కనకమామిడి వరకు కొనసాగనుంది. దాదాపు పది కిలోమీటర్లు పాటు ఈ పాదయాత్ర సాగుతుంది. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటున్నారు. అడుగడునా బండి సంజయ్‌కు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఈ పాదయాత్రలో తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు బండి సంజయ్. 

Tags:    

Similar News