BJP: వివాద రహితులకే బీజేపీ పగ్గాలు

తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు ఖరారు.. తెలంగాణ చీఫ్‌గా రామచందర్‌రావు, ఏపీ అధ్యక్షుడిగా మాధవ్;

Update: 2025-07-01 02:00 GMT

బీ­జే­పీ ని­ర్ణ­యా­లు చా­లా­మం­ది­కి అం­తు­బ­ట్ట­వు. నే­త­లు ఒకటి భా­వి­స్తే.. హై­క­మం­డ్ తీ­సు­కు­నే ని­ర్ణ­యా­లు మరో­లా ఉం­టా­యి. మోదీ-అమి­త్ షా వచ్చాక ఆ పా­ర్టీ రూ­పు­రే­ఖ­లు మా­రి­పో­యా­యి. అం­ద­రూ ఊహిం­చిన మా­ది­రి­గా­నే వి­వా­దా­ల­కు దూ­రం­గా ఉండే వ్య­క్తు­ల­కు కమలం పా­ర్టీ­లో అగ్ర­స్థా­నం దక్కు­తుం­ద­న్న వాదన ఉంది. ఈసా­రి కూడా అదే ని­జ­మైం­ది. సు­దీ­ర్ఘ కా­లం­గా ఎదు­రు­చూ­స్తు­న్న తె­లు­గు రా­ష్ట్రా­ల్లో బీ­జే­పీ అధ్య­క్ష పద­వుల ఉత్కం­ఠ­కు తె­ర­ప­డిం­ది. ఎట్ట­కే­ల­కు ఆం­ధ్ర­ప్ర­దే­శ్, తె­లం­గా­ణ­కు బీ­జే­పీ రథ సా­ర­థు­లు వచ్చే­శా­రు. తె­లం­గా­ణ­కు రా­మ­చం­ద­ర్‌­రా­వు, ఏపీ­కి మా­ధ­వ్ పే­ర్లు ఖరా­ర­య్యా­యి. నే­త­లి­ద్ద­రు తమ తమ రా­ష్ట్రాల నుం­చి నా­మి­నే­ష­న్లు దా­ఖ­లు చే­శా­రు. వి­వా­దా­ల­కు దూ­రం­గా ఉన్న­వా­రి­కే పా­ర్టీ గ్రీ­న్ సి­గ్న­ల్ ఇచ్చిం­ద­ని బీ­జే­పీ వర్గా­లు వె­ల్ల­డిం­చా­యి. ఆరు నె­ల­లు వడ­పో­సి చి­వ­ర­కు తె­లం­గా­ణ­కు బీ­జే­పీ చీ­ఫ్‌­గా మాజీ ఎమ్మె­ల్సీ రా­మ­చం­ద­ర్‌­రా­వు పేరు ఖరా­రైం­ది. అధ్య­క్షు­డి పద­వి­కి ఆయన నా­మి­నే­ష­న్‌ దా­ఖ­లు చే­శా­రు. బీ­జే­పీ తె­లం­గాణ అధ్య­క్ష పద­వి­కి చి­వ­రి­వ­ర­కు ఈటెల రా­జేం­ద­ర్, ధర్మ­పు­రి అర్విం­ద్ పో­టీ­‌­ప­డ్డా­రు. చి­వ­ర­కు రా­మ­చం­ద­ర్‌­రా­వు పే­రు­ను అధి­ష్టా­నం ఖరా­రు చే­సిం­ది.

ఏపీ అధ్యక్షుడిగా మాధవ్

ఏపీ బీ­జే­పీ పగ్గా­ల­ను సీ­ని­య­ర్ నేత, బీసీ నా­య­కు­డు పీ­వీ­ఎ­న్ మా­ధ­వ్ కి అప్ప­గిం­చ­ను­న్నా­రు. పా­ర్టీ­లో వి­ద్యా­ర్ధి దశ నుం­చి మా­ధ­వ్ పని­చే­స్తు­న్నా­రు. ఏబీ­వీ­పీ నుం­చి ఆయ­న­కు బీ­జే­పీ­తో సహ­వా­సం మొ­ద­లైం­ది. అంతే కాదు ఆయన తం­డ్రి స్వ­ర్గీయ పీవీ చల­ప­తి­రా­వు బీ­జే­పీ ఉమ్మ­డి ఏపీ­లో తొలి అధ్య­క్షు­డి­గా పని­చే­శా­రు. ని­జా­యి­తీ­తో కూ­డిన రా­జ­కీ­అ­యం చే­య­డ­మే కా­కుం­డా సమ­ర్ధు­డి­గా మా­ధ­వ్ పేరు తె­చ్చు­కు­న్నా­రు. ఆయ­న­కు 2024 ఎన్ని­క­ల్లో పా­ర్టీ టి­కె­ట్ ని కే­టా­యిం­చ­లే­దు. అయి­నా పా­ర్టీ అభ్య­ర్ధుల వి­జ­యా­ని­కి పని­చే­శా­రు. పా­ర్టీ ఫస్ట్ అన్న దా­ని­కి మా­ధ­వ్ కట్టు­బ­డి ఉం­టా­రు. ఉన్నత వి­ద్యా­ధి­కు­డు అయిన పీ­వీ­ఎ­న్ మా­ధ­వ్ 2017 నుం­చి 2023 దాకా ఉత్త­రాం­ధ్ర పట్ట­బ­ధ్రుల ఎమ్మె­ల్సీ­గా పని­చే­శా­రు. ఆయన పా­ర్టీ లైన్ దాటి ఎపు­డూ ముం­దు­కు సా­గ­లే­దు అని పేరు ఉంది. ఇక ఆయన పట్ల బీ­జే­పీ అధి­నా­య­క­త్వం ఎంతో సా­ను­కూ­లం­గా ఉం­డ­డం­తో పాటు అన­కా­ప­ల్లి ఎంపీ సీఎం రమే­ష్ మద్ద­తు కూడా తోడు కా­వ­డం­తో పీ­వీ­ఎ­న్ మా­ధ­వ్ బీ­జే­పీ­కి నూతన అధ్య­క్షు­డు అవు­తు­న్నా­రు. పార్టీలో పుట్టి పెరిగిన మాధవ్ అభ్యర్ధిత్వం పట్ల ఎవరికీ వేరే ఆలోచనలు లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇప్పటిదాకా పార్టీ బయట నుంచి వచ్చిన వారికే అధ్యక్ష పదవులు అప్పగించింది.

రా­మ­చం­ద­ర్‌­రా­వుకు పగ్గాలు

తె­లం­గాణ బీ­జే­పీ అధ్య­క్షు­డి­గా ఎన్. రాం­చం­ద­ర్ రావు ని­య­మి­తు­ల­య్యా­రు. కి­ష­న్ రె­డ్డి స్థా­నం­లో ఆయన బా­ధ్య­త­లు చే­ప­ట్ట­ను­న్నా­రు. రాం­చం­ద­ర్ రావు ఆరె­స్సె­స్, ఏబీ­వీ­పీ­ల్లో పని­చే­య­డం­తో­పా­టు, పా­ర్టీ­కి వి­ధే­యు­డు, వి­వా­ద­ర­హి­తు­డ­నే ము­ద్ర ఉం­డ­టం­తో అధి­ష్టా­నం ఆయ­న్ను ఎం­పిక చే­సిం­ది. అం­ద­రి­నీ కలు­పు­కొ­ని పోయే మన­స్త­త్వం ఉన్న రాం­చం­ద­ర్ రావు తె­లం­గా­ణ­లో పా­ర్టీ­ని బలో­పే­తం చే­య­డా­ని­కి ఎప్ప­టి నుం­చో కృషి చే­స్తు­న్నా­రు. ఆయ­న­కు క్షే­త్ర­స్థా­యి­లో­నూ అం­ద­రి­తో బల­మైన సం­బం­ధా­లు ఉం­డ­టం బీ­జే­పీ­కి కలి­సి రా­నుం­ది. కి­ష­న్ రె­డ్డి కంటే ముం­దు తె­లం­గాణ అధ్య­క్షు­డి­గా బీసీ సా­మా­జి­క­వ­ర్గా­ని­కి చెం­దిన బండి సం­జ­య్ వ్య­వ­హ­రిం­చా­రు. ఆయన నా­య­క­త్వం­లో పా­ర్టీ తె­లం­గా­ణ­లో బాగా పుం­జు­కుం­ది. కానీ తె­లం­గాణ అసెం­బ్లీ ఎన్ని­కల ముం­దు అనూ­హ్యం­గా ఆయన స్థా­నం­లో కి­ష­న్ రె­డ్డి­కి పగ్గా­లు అప్ప­గిం­చా­రు. రా­ష్ట్రం­లో బీ­సీల జనా­భా ఎక్కువ కా­వ­డం­తో.. మరో­సా­రి బీసీ నే­త­కే పా­ర్టీ పగ్గా­లు అప్ప­గి­స్తా­ర­ని చాలా మంది భా­విం­చా­రు. కానీ ఆరె­స్సె­స్ అం­డ­దం­డ­లు పు­ష్క­లం­గా ఉన్న రాం­చం­ద­ర్ రా­వు­ను ఆ పదవి వరిం­చిం­ది. ఏపీ­లో­నూ మొ­ద­టి నుం­చి బీ­జే­పీ­తో­నే ఉన్న మా­ధ­వ్‌­కు ఆ పా­ర్టీ పగ్గా­లు దక్కు­తుం­డ­టం ఈ సం­ద­ర్భం­గా ప్ర­స్తా­వ­నా­ర్హం. రాం­చం­ద­ర్ రావు మొ­ద­టి నుం­చి బీ­జే­పీ­తో­నే ఉన్నా­రు. వి­ద్యా­ర్థి­గా ఉన్న­ప్ప­టి నుం­చే ఆయన ఆరె­స్సె­స్, ఏబీ­వీ­పీ­ల్లో పని చే­శా­రు. బీ­జే­వై­ఎం, లీ­గ­ల్ సె­ల్‌ల నుం­చి ఆయన నా­య­కు­డి­గా ఎది­గా­రు. న్యా­య­వా­ది అయిన రాం­చం­ద­ర్ రావు గతం­లో హై­ద­రా­బా­ద్ బీ­జే­పీ జి­ల్లా అధ్య­క్షు­డి­గా­నూ పని చే­శా­రు. గె­లు­పో­ట­ము­ల­కు అతీ­తం­గా ఆయన పా­ర్టీ పట్ల అం­కి­త­భా­వం­తో పని చే­శా­రు. బీ­జే­పీ అధి­ష్టా­నా­ని­కి నమ్మ­క­స్తు­డు కా­వ­డం­తో­పా­టు సౌ­మ్యు­డైన ఆయ­న­కు ఎవ­రి­తో­నూ ఆయ­న­కు వి­బే­ధా­లు లేవు. క్షే­త్ర స్థా­యి కా­ర్య­క­ర్తల దగ్గ­ర్నుం­చి అత్యు­న్నత స్థా­యి నేతల వరకు అం­ద­రి­తో­నూ ఆయ­న­కు మంచి పరి­చ­యా­లు ఉన్నా­యి. తె­లం­గాణ రా­జ­కీ­యాల పట్ల బీ­జే­పీ గత కొంత కా­లం­గా ఆచి­తూ­చి వ్య­వ­హ­రి­స్తోం­ది. ప్ర­స్తుత పరి­స్థి­తు­ల్లో దూ­కు­డు­గా వ్య­వ­హ­రిం­చే నేతల కంటే.. వి­వాద రహి­తు­డు, అం­ద­రి­ని కలు­పు­కొ­ని పోయే మన­స్త­త్వం ఉన్న రాం­చం­ద­ర్ రా­వు­ను ఎం­పిక చే­య­డ­మే బె­ట­ర్ అనే అభి­ప్రా­యా­ని­కి కమల నా­థు­లు వచ్చా­రు.

Tags:    

Similar News