BJP: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠ
తుది దశకు చేరుకున్న కమలం కసరత్తు... ఢిల్లీ చేరుకున్న బీజేపీ చీఫ్ రాంచందర్రావు.. నేడు బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై బీజేపీ కూడా కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ జాతీయ నేతలు సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ ల తో ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీలో జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆశావహుల షార్ట్ లిస్ట్ తయారు చేసింది బీజేపీ. ఆ షార్ట్ లిస్ట్ లో లంకల దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, వీరపనేని పద్మ పేర్లు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అభ్యర్థి ఎంపిక విషయంలో బీఆర్ఎస్ ముందుంది. బీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించడమే కాకుండా ప్రచారం పర్వాన్ని ముమ్మరం చేసింది. అటు కాంగ్రెస్ సైతం తమ అభ్యర్థిని ప్రకటించేసింది. నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చింది. ఇక బీజేపీ జాతీయ అధినాయకత్వం కూడా ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ఫైనల్ చేయనుంది. టికెట్ ఎవరికి ఇచ్చినా మిగతా వ్యక్తులు.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయాల్సిందేనని, అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని బీజేపీ అధినాయకత్వం తేల్చి చెప్పింది.
ఢిల్లీ చేరుకున్న బీజేపీ చీఫ్
అభ్యర్ధిని ఖరారు చేసేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ జాతీయ నేతలైన బీఎల్సంతోష్, సున్సీల్భన్సల్తో సమావేశమైన ఇటీవల ఆయనకు త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక అందజేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పార్లమెంటరీ బోర్డు చర్చించిన అనంతరం అభ్యర్ధి ప్రకటన ఉంటుందని తెలిసింది. కమిటీ ఇచ్చిన నివేదికలో దీపక్రెడ్డి, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ పేర్లు ఉన్నట్లు పార్టీలో టాక్వినిపిస్తోంది. వీరు ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్పార్టీలను గెలిపిస్తే దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధి ఉండదని విమర్శలు చేస్తున్నారు. 11 ఏళ్ల మోడీ పాలనలో దేశంలో అభివృద్దిలో దూసుకపోతుందని, తెలంగాణ కూడా పార్టీని ప్రజలు ఆదరించాలని కోరుతున్నారు. హైకమాండ్రాష్ట్ర నాయకులు పంపించిన జాబితాలోని ముగ్గురి రాజకీయ నేపథ్యం, ప్రజల్లో పలుకుబడి, పార్టీకి అందించిన సేవలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేయనున్నట్లు సీనియర్లు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేస్ అభ్యర్థులను బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రటించేశాయి. ఇప్పుడు బీజేపీ ఎవర్ని బరిలోకి దింపుతుందనే చర్చ సాగుతోంది. లోకల్గా పట్టున్న ఆయనైతే సీటు గెలవడం సులభం అవుతుందని ఎంత మంది పోటీలో ఉన్నా నవీన్ యాదవ్వైపు ముఖ్యమంత్రి, మిగతా పార్టీ నాయకులు నిలబడ్డారు.
బీజేపీ చీఫ్కు తొలి ఎన్నిక
బీజేపీ తెలంగాణ పార్టీ పగ్గాలు అందుకున్న రాంచంద్రర్రావు ఎదుర్కంటున్న తొలి ఎన్నిక ఇదే కావడంతో, ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయి, అభ్యర్థి ఎంపికలో ఏం చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థి ఎంపికకు ప్రత్యేక కమిటీ వేశారు. ధర్మారావు, పోతుగంటి రాములు, అంజనేయలు చాలా మంది పేర్లు పరిశీలించారు. వీళ్లు వివిధ మార్గాల్లో పార్టీ వర్గాలతో మాట్లాడారు. పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర నివేదిక రాష్ట్ర అధ్యక్షుడికి ఇచ్చారు. వీరు పంపించిన పేర్లను పరిశీలించిన తర్వాత వారిలో షార్ట్ లిస్ట్ చేసి ముగ్గురు పేర్లను అధిష్ఠానానికి పంపిస్తారు. దీన్ని రాష్ట్ర బీజేపీ కీలక నేతలు పరిశీలించి ఈ లిస్ట్ను ఢిల్లీ పంపిస్తారు. శుక్రవారం వాటిని పరిశీలించనున్న అధిష్ఠానం ఒకరి పేరును ఫైనల్ చేస్తుంది. కమిటీ పేర్కొన్న లిస్టులో చాలా పేర్లు ఉన్నప్పటికీ టాప్లో మాత్రం లంకల దీపక్ రెడ్డి, వీరపనేని పద్మ, కీర్తిరెడ్డి ఉన్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. వీరిలో దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అందుకే ఆయనకే ఈసారి కూడా మరో ఛాన్స్ ఇస్తారని ఆయన వర్గం గట్టిగానే ప్రచాంర చేస్తోంది. రాష్ట్ర, ఢిల్లీ స్థాయిలో కూడా కీలక నేతలతో ఉన్న సంబంధాలు ఆయనకు అక్కరకు వస్తాయని అంటున్నారు. మహిళకు ఇవ్వాలనుకుంటే మాత్రం కీర్తిరెడ్డికి లక్కీ ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై అన్ని పార్టీలు గట్టిగా ఫోకస్ పెట్టాయి. అందుకు తగ్గట్టుగానే పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ముందే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళ్తోంది.