కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేత శ్రీధర్రెడ్డి
టీఆర్ఎస్ ఏం చేసిందో నిరూపించేందుకు సిద్ధమన్నారు మంత్రి కేటీఆర్. విపక్షాలకు ఆర్భాటం తప్ప విషయం ఉండదన్నారు. కేటీఆర్ సమక్షంలో బీజేపీ నేత శ్రీధర్రెడ్డి..
టీఆర్ఎస్ ఏం చేసిందో నిరూపించేందుకు సిద్ధమన్నారు మంత్రి కేటీఆర్. విపక్షాలకు ఆర్భాటం తప్ప విషయం ఉండదన్నారు. కేటీఆర్ సమక్షంలో బీజేపీ నేత శ్రీధర్రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. అభివృద్ధి, సంక్షేమం చూసి టీఆర్ఎస్లో చేరుతున్నారన్న కేటీఆర్.. ఆరేళ్లలో ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్దే విజయమన్నారు. అటు.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని.. బీజేపీ నేతలు ప్రజలకు భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధే కేసీఆర్ ఎజెండా అని.. అందుకే ప్రజలు అడుగడుగునా కేసీఆర్ నాయకత్వానికి జైకొడుతున్నారని పేర్కొన్నారు.