RAJASINGH: కాళేశ్వరం ముమ్మాటికీ అవినీతి ప్రాజెక్టే: రాజాసింగ్

Update: 2025-06-24 06:30 GMT

ప్ర­ధా­ని మోదీ చె­ప్పి­న­ట్లు­గా కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్ట్‌­ని ఏటీ­ఎం­లా­గా బీ­ఆ­ర్ఎ­స్ నే­త­లు వా­డు­కు­న్న­ది వా­స్త­వం కాదా అని బీ­జే­పీ గో­షా­మ­హ­ల్ ఎమ్మె­ల్యే రా­జా­సిం­గ్ ప్ర­శ్నిం­చా­రు. కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్ట్‌­పై ప్ర­ధా­ని మోదీ, అమి­త్ షా, జేపీ నడ్డా చె­ప్పిన మా­ట­లే తమ స్టాం­డ్ అని స్ప­ష్టం చే­శా­రు. కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్ట్‌­లో జరి­గిన అవి­నీ­తి­పై కేం­ద్ర­మం­త్రి బండి సం­జ­య్ ఆధా­రా­ల­తో సహా బయట పె­ట్ట­గా­నే గు­లా­బీ పా­ర్టీ నా­య­కు­లు అవా­కు­లు చె­వా­కు­లు పే­లు­తు­న్నా­ర­ని మం­డి­ప­డ్డా­రు. బండి సం­జ­య్‌­పై బీ­ఆ­ర్ఎ­స్ నే­త­లు చే­స్తు­న్న వ్యా­ఖ్య­ల­ను తాను ఖం­డి­స్తు­న్నా­న­ని అన్నా­రు. కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్ట్‌ ము­మ్మా­టి­కీ అవి­నీ­తి ప్రా­జె­క్టే­‌­న­ని ఆయన ఆరో­పిం­చా­రు. అం­దు­లో బీ­జే­పీ­ది, తమ నే­త­ల­ది ఒకే అభి­ప్రా­య­మ­ని రా­జా­సిం­గ్ స్ప­ష్టం చే­శా­రు. రూ.38 వేల కో­ట్ల­తో పూ­ర్త­య్యే ఈ ప్రా­జె­క్ట్‌­ని రీ­డి­జై­న్ పే­రు­తో రూ.1.20 లక్షల కో­ట్లు పెం­చ­లే­దా అని ని­ల­దీ­శా­రు. ఆనా­డు స్వ­యం ప్ర­క­టిత ఇం­జ­నీ­ర్‌­గా అవ­తా­రం ఎత్తి కే­సీ­ఆ­ర్ కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్ట్‌­ని చే­ప­డి­తే.. ఈనా­డు కే­టీ­ఆ­ర్ ఎన్డీ­ఎ­స్‌ఏ కంటే తానే తె­లి­వైన మే­ధా­వి­గా ప్ర­వ­ర్తిం­చ­డం సి­గ్గు­చే­ట­ని రా­జా­సిం­గ్ వి­మ­ర్శిం­చా­రు. బండి సంజయ్ లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం బీఆర్ఎస్ నేతల ఓటమికి నిదర్శనమని ఆయన అన్నారు.

Tags:    

Similar News