అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సరైన సమయం ఇవ్వలేదు : రఘునందన్రావు
టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చి
టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్షాలకు సరైన సమయం ఇవ్వలేదని ఆరోపించారు. పాలక పక్షం నేతల భజనకే అధిక సమయం కేటాయించుకున్నారని విమర్శించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు నిరసన తెలపలేదని ప్రశ్నించారు. బయ్యారం స్టీల్ప్లాంట్పై 2014లో ప్రత్యామ్నాయం చెప్పమని కేంద్రం చెప్పినా ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదన్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల కోసమే ఇప్పుడు బయ్యారంపై టీఆర్ఎస్ కార్యకర్తలతో సీఎం కేసీఆర్ ధర్నా చేయిస్తున్నారని రఘునందన్రావు ధ్వజమెత్తారు.