Dharmapuri Arvind: కేసీఆర్‌ చేసేది శంకుస్థాపనలే.. ప్రారంభోత్సవాలు కాదు: బీజేపీ ఎంపీ

Dharmapuri Arvind: తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్‌ ఏం చేశారని.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ప్రశ్నించారు.

Update: 2022-12-09 10:04 GMT

Dharmapuri Arvind: తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్‌ ఏం చేశారని.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ప్రశ్నించారు. నరేగా పథకం కింద కర్నాటక అదనంగా కోట్లు ఖర్చు పెడుతోందన్న ఆయన.. రాష్ట్ర సర్కార్‌ ఎందుకు నిధులు ఇవ్వట్లేదన్నారు.



కేసీఆర్‌ తన కూతురు కవితకు 100 కోట్లు ఇచ్చి విజయ్‌నాయర్‌కు ఇవ్వమని చెప్పడం తెలుసని.. కొడుకుతో ఫీనిక్స్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టించడం తెలుసుకు కానీ.. ప్రజల కోసం ఖర్చు పెట్టడం తెలియదని విమర్శించారు. ఇక కోవిడ్‌ సమయంలో కూడా కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.



గరీబ్‌ యోజన, ఆవాస్‌ యోజన సహా అనేక పథకాల కింద.. పేదలకు మోదీ వేలకోట్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక కేసీఆర్‌ చేసేది శంకుస్థాపనలేనని.. ప్రారంభోత్సవాలు కాదని పేర్కొన్నారు.

Tags:    

Similar News