BJP: బండి-ఈటల మధ్య ముదురుతున్న వైరం

ఈటల వ్యాఖ్యలతో బీజేపీలో కలకలం

Update: 2025-11-18 05:30 GMT

తెలంగాణ బీజేపీలో అంతర్గత కలహాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తాజాగా చేసిన ఘాటు వ్యాఖ్యలు పార్టీలోని వర్గ విభేదాలను మరింత స్పష్టం చేశాయి. ఈ వ్యాఖ్యలు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఉద్దేశించినవనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య గత కొంత కాలంగా ఉన్న రాజకీయ ఘర్షణ ఇప్పుడు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఈ వివాదం మరింత ముదిరి, పార్టీలో ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఇలా అయితే  కష్టమే:ఈటల

తె­లం­గాణ బీ­జే­పీ కీలక నేత, మల్కా­జి­గి­రి ఎంపీ ఈటల రా­జేం­ద­ర్ సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. సో­మ­వా­రం ఆయన ఓ మీ­డి­యా ఛా­న­ల్ ప్ర­తి­ని­ధి­తో మా­ట్లా­డా­రు. తె­లం­గా­ణ­లో డి­వి­జి­న్ పా­లి­టి­క్స్‌­తో గె­ల­వ­లేం అని అన్నా­రు. ఇది తన వ్య­క్తి­గత అభి­ప్రా­య­మ­ని చె­ప్పా­రు. కులం, మతం ప్రా­తి­ప­ది­క­గా ఎక్క­డా రా­జ­కీ­యా­లు ని­ల­బ­డ­వు అని అన్నా­రు. జూ­బ్లీ­హి­ల్స్ ఉపఎ­న్ని­క­ల్లో ఓట­ర్ల­ను ప్ర­లో­భ­పె­ట్టా­రు.. గతం­లో కే­సీ­ఆ­ర్ పని­నే ఇప్పు­డు రే­వం­త్ రె­డ్డి చే­శా­రు.. ఇద్ద­రి­కీ తేడా ఏం లే­ద­ని అన్నా­రు. కాం­గ్రె­స్ గతం­లో ఎక్కడ ఉపఎ­న్నిక జరి­గి­నా డి­పా­జి­ట్ కో­ల్పో­యిం­ది.. ఈ వి­ష­యా­న్ని ఆ పా­ర్టీ నే­త­లు మర్చి­పో­వ­ద్దు అని హి­త­వు పలి­కా­రు. మతం ప్రా­తి­ప­ది­కన చేసే రా­జ­కీ­యా­లు ని­ల­బ­డ­వు అని ఈటల కా­మెం­ట్ చే­య­డం టా­పి­క్‌­గా మా­రిం­ది. మరో­సా­రి బండి, ఈటల మధ్య వైరం ము­దు­రు­తు­న్న­ట్లు ప్ర­చా­రం జరు­గు­తోం­ది.

తెలంగాణ బీజేపీలో వర్గ పోరు కొత్తేమీ కాదు. గతంలోనూ ఈటల, బండి సంజయ్ మధ్య విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పటికీ, ఈటల 2024లో ఈ విషయాన్ని ఖండించారు. “బండి సంజయ్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. కొందరు చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే” అని ఆయన స్పష్టం చేశారు. అయితే, తాజా వ్యాఖ్యలు ఈ ఖండనను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. బీజేపీ అధిష్ఠానం ఈ వివాదంపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News