గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రజల నుంచి లభిస్తున్న స్పందనే ఇందుకు నిదర్శనమని తెలిపారు. కొత్తపేట నుంచి నాగోల్ వరకు నిర్వహిస్తున్న రోడ్షోలో మాట్లాడిన నడ్డా.... హైదరాబాద్ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని చెప్పారు. ప్రతీ డివిజన్లో కమలం వికసించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలని చెప్పారు.