సందర్శకులతో కిటకిటలాడుతున్న తెలంగాణ మినీ నయాగారా జలపాతం
టీవలే పర్యాటకులకు అనుమతులు ఇవ్వడంతో సందర్శకుల తాకిడి పెరిగి కిటకిటలాడుతోంది.;
తెలంగాణ మినీ నయాగారాగా పేరొందిన బొగత జలపాతానికి సందర్శకుల తాకిడి పెరిగింది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీప్రాంతంలో జలపాతం కరోనా కారణంగా గత కొంతకాలంగా మూతపడింది.
అధికారులు ఇటీవలే పర్యాటకులకు అనుమతులు ఇవ్వడంతో సందర్శకుల తాకిడి పెరిగి కిటకిటలాడుతోంది. కొలనులో ఈత కొడుతూ జనం సరదాగా గడుపుతున్నారు. వరంగల్,కరీంనగర్, హైదరాబాద్ నుంచి పర్యాటకులు వచ్చి.. జలపాతం అందాలను ఆస్వాధిస్తున్నారు.