ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

Update: 2020-10-10 11:41 GMT

యాసంగిలో నిర్ణీత పంట సాగు, ధాన్యం కొనుగోలు సహా వివిధ అంశాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఈ నెల 13న శాసనసభ, 14న శాసన మండలి సమావేశాలు నిర్వహించనున్నారు. కేబినెట్ తీర్మానాల్ని బిల్లు రూపంలో ఉభయ సభల్లో ప్రవేశ పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే... జీహెచ్‌ఎంసీ చట్టంలో మార్పులపైనా మంత్రివర్గంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News