REVANTH:కేసీఆర్ ఓ చెల్లని రూపాయి: రేవంత్

అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్ కు లేదని రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు;

Update: 2025-03-11 02:00 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ చెల్లని రూపాయి అని.. ఆయన గురించి మాట్లాడడం కూడా వృథా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ స్థాయిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చిట్ చాట్‌గా మాట్లాడారు. కేటీఆర్ అన్నట్లు నిజంగానే అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్ కు లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసులకు తాను భయపడబోనని కేటీఆర్ వ్యాఖ్యలపైనా సీఎం ఘాటుగా స్పందించారు. బీజేపీకి హరీష్ రావు పూర్తిగా లొంగిపోయాడని స్పష్టం చేశారు. రైతులకు కష్టాలు ఎదురవుతున్నాని తెలిస్తే చాలు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పైశాచిక ఆనందం పొందుతున్నారని రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీని పడావ్ పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాళేశ్వరం కట్టిందని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసి ఉంటే..ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. గతంలో రెండో పంట 35లక్షల ఎకరాలు వేశారు. కానీ ఇప్పుడు మొదటి సారి రాష్ట్రంలో 55 లక్షల ఎకరాలలో రైతులు పంటలు వేశారని గుర్తు చేశారు. కాళేశ్వరం కట్టామని చెప్పుకుంటున్నామని ఇప్పుడు కరువు వచ్చిందని అంటున్నారని మండిపడ్డారు.

తేల్చుకుందాం రా.. రేవంత్ సవాల్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ఇస్తున్న నిధులెంత.. కేంద్రం ఇస్తున్న నిధులెంతో తేల్చుకుందామని సవాల్ విసిరారు. చర్చకు తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వస్తామని కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చించేందుకు రావాలని కిషన్ రెడ్డిని కోరారు. తెలంగాణ నుంచి ఎన్ని పన్నులు కట్టాం.. వాళ్లు ఎన్ని ఇచ్చారో లెక్క తేలుద్దామని సవాల్ చేశారు.

రేవంత్‌ను కలిసిన అద్దంకి దయాకర్

సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్ కలిశారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి అద్దంకి దయాకర్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్‌తో పాటు విజయశాంతి, కేతావత్ శంకర్ పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు.

Tags:    

Similar News