CM: బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టనివ్వం

Update: 2025-04-10 05:30 GMT

ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరుగుతోన్న ఏఐసీసీ సమావేశాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనీయమని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ మరింత విస్తరిస్తోంది. సరైన నాయకత్వమే బీజేపీకి ఉండి ఉంటే , బీఆర్ఎస్ ప్లేసులో కమలం ఎప్పుడో చేరి ఉండేది. రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటో కానీ.. బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టనివ్వనని తేల్చి చెప్పారు. గాంధీ , సర్దార్ పుట్టిన గడ్డపై సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయని, ఇక్కడి సమావేశాల స్పూర్తితో తిరిగి తెలంగాణకు వెళ్లి బీజేపీని ఖతం చేయడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు.





Tags:    

Similar News