కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను విస్మరించాడు: రాములు నాయక్
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిదని కాంగ్రెస్ నేత రాములు నాయక్ అన్నారు
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిదని కాంగ్రెస్ నేత రాములు నాయక్ అన్నారు. కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికులను విస్మరించారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. ఆర్టీసీ కార్మికులంతా ఏకమై కేసీఆర్ను గద్దె దించాలని పిలుపు నిచ్చారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటామన్నారు రాములు నాయక్.