CONGRESS: పాదయాత్రలో కలిసి నడుస్తారా..?

జులై 31 నుంచి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర... కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యం....కాంగ్రెస్ నేతలు ఏకమవుతారా అన్న ప్రశ్న... నేటి నుంచి టీపీసీసీ చీఫ్ జనహిత యాత్ర;

Update: 2025-07-31 04:30 GMT

తె­లం­గాణ కాం­గ్రె­స్ వ్య­వ­హా­రాల ఏఐ­సీ­సీ ఇన్‌­చా­ర్జ్‌ మీ­నా­క్షి నట­రా­జ­న్ జులై 31 నుం­డి తె­లం­గా­ణ­లో పా­ద­యా­త్ర చే­ప­ట్ట­ను­న్నా­రు. ఈ పా­ద­యా­త్ర రా­ష్ట్రం­లో కాం­గ్రె­స్ పా­ర్టీ­ని బలో­పే­తం చే­య­డం, ప్ర­జ­ల­తో సం­బం­ధా­ల­ను బల­ప­ర­చ­డం, ప్ర­భు­త్వ వి­ధా­నా­ల­ను ప్ర­చా­రం చే­య­డం కోసం అని కాం­గ్రె­స్ పా­ర్టీ ప్ర­క­టిం­చిం­ది. వారం రో­జుల షె­డ్యూ­ల్ ను ఖరా­రు చే­శా­రు. రో­జు­కో ని­యో­జ­క­వ­ర్గం­లో ప్ర­తి ని­యో­జ­క­వ­ర్గం­లో 8 నుం­డి 10 కి­లో­మీ­ట­ర్ల పా­ద­యా­త్ర ని­ర్వ­హి­స్తా­రు. రా­ష్ట్రం­లో­ని ఆరు ని­యో­జ­క­వ­ర్గా­ల్లో పా­ద­యా­త్ర చే­య­ను­న్నా­రు. ఇం­దు­కో­సం రూట్ మ్యా­ప్ సైతం సి­ద్ధ­మైం­ది. ప్ర­జ­ల­తో మమే­కం కా­వ­డం­తో­పా­టు వారు ఎదు­ర్కొం­టు­న్న సమ­స్య­ల­ను ప్ర­త్య­క్షం­గా తె­లు­సు­కో­ను­న్నా­రు. ఈ క్ర­మం­లో శ్ర­మ­దా­నం కూడా చే­య­ను­న్నా­రు. ఇప్ప­టి­కే కాం­గ్రె­స్ పా­ర్టీ ప్రా­రం­భిం­చిన జై­భీ­మ్, జై బాపూ, జై సం­వి­ధా­న్ పై ని­నా­దా­న్ని ప్ర­జ­ల్లో­కి వి­స్తృ­తం­గా తీ­సు­కె­ళ్లా­ల­ని మీ­నా­క్షి భా­వి­స్తు­న్న­ర­ని తె­లు­స్తోం­ది. త్వ­ర­లో స్థా­నిక సం­స్థల ఎన్ని­క­లు జర­గ­ను­న్న నే­ప­థ్యం­లో క్షే­త్ర స్థా­యి­లో పా­ర్టీ నా­య­క­త్వా­న్ని బలో­పే­తం చేసే ది­శ­గా ఆమె ప్లా­న్ చే­స్తు­న్నా­రు.  

 పరిగి నుంచే ప్రారంభం

ఈ నెల 31 నుం­చి ఏడు రో­జుల పాటు ఆమె జి­ల్లా­ల్లో పర్య­టి­స్తా­ర­ని సమా­చా­రం. తొ­లుత పరి­గి సె­గ్మెం­ట్ నుం­చి పా­ద­యా­త్ర ప్రా­రం­భి­స్తా­రు. తొలి దపా­లో పరి­గి, అం­దో­ల్, ఆర్మూ­ర్, ఖా­నా­పూ­ర్, చొ­ప్ప­దం­డి, వర్ధ­న్న­పేట సె­గ్మెం­ట్ల­లో పర్య­టి­స్తా­రు. ప్ర­తి ఉమ్మ­డి జి­ల్లా­లో­ని ఒక ని­యో­జ­క­వ­ర్గం­లో పా­ద­యా­త్ర­తో పాటు రా­త్రి బస చే­యా­ల­ని ఆమె భా­వి­స్తు­న్నా­రు. ఇలా రా­ష్ట్రం­లో­ని అన్ని ఉమ్మ­డి జి­ల్లా­ల­ను కవర్ చే­సేం­దు­కు ప్లా­న్ చే­స్తు­న్న­ట్టు సమా­చా­రం.

పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో తొలి విడత

కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న పరిగి, అందోల్, ఖానాపూర్, వర్దన్నపేట, చొప్పదండి, ఆర్మూర్ నియోజకవర్గాల్లో తొలి విడతగా పాదయాత్రలు, శ్రమదానం చేపట్టనున్నారు. అదే సమయంలో ఆ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో మీనాక్షి, మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. దాంతో పాటు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అమలు చేయాల్సిన వ్యూహాలను వివరించున్నారు. ఈ కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ కేడర్‌లో ఉత్సాహంతో పాటు, జిల్లా పార్టీ యాక్టివ్ అవడం, పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలకు సైతం చెక్ పెట్టే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News