తెలంగాణలో కలకలం రేపుతోన్న కరోనా సెకండ్ వేవ్..!
తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వేవ్ కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం కూడ అప్రమత్తమయింది.;
తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వేవ్ కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం కూడ అప్రమత్తమయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సరిహద్దుల్లో వైద్యబృందాలను రంగంలోకి దింపింది. మహారాష్ట్ర,కర్ణాటక నుంచి జిల్లాలోకి వస్తోన్న ప్రతి వాహనాన్నిక్షుణ్ణంగా తనఖీ చేస్తున్నారు. ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా అనుమానితులను జిల్లాలోకి అనుమతించడం లేదు. యుకె నుంచి వచ్చిన ఓ వ్యక్తికి స్ట్రెయిన్ లక్షణాలు కనిపించడం మరింత కలవర పెడుతోంది.