కరోనా వ్యాక్సిన్‌ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Update: 2020-11-12 11:08 GMT

కరోనా వ్యాక్సిన్‌ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని.. అప్పటి వరకు ప్రతి ఒక్కరూ ఆయుర్వేద నియమాలను పాటించాలన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. యోగా తరహాలో ఆయుర్వేద వైద్యానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారాయన. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ దివ్యసాకేతంలో నిర్వహించిన 5 వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకల్లో.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఈటల రాజేందర్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Tags:    

Similar News