గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి కోసమే సీఎం కేసీఆర్ వరద బాధితులకు ఆర్థిక సాయం అందించారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతే సాయం చేశారని విమర్శించారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైతో డీకే అరుణ భేటీ అయ్యారు. అనర్హులకు వరద సాయం అందించారని ఫిర్యాదు చేశారు. వరద బాధితుల్ని సీఎం కేసీఆర్ పరామర్శించలేదని మండిపడ్డారు.