kidney stones : అతడి కిడ్నీలో 206 రాళ్లు.. గంటలో తొల‌గించిన వైద్యులు..!

kidney stones : హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ 51 ఏళ్ల వృద్దుడి కిడ్నీలో నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 206 రాళ్ళను వైద్యులు తొలిగించారు.

Update: 2022-05-20 08:30 GMT

kidney stones : హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ 51 ఏళ్ల వృద్దుడి కిడ్నీలో నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 206 రాళ్ళను వైద్యులు తొలిగించారు. నల్గొండకి చెందిన వీరమల్ల రామలక్ష్మయ్య కిడ్నిలో భరించలేని నొప్పి రావడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.

ఈ క్రమంలో టెస్టులు చేసి లెఫ్ట్ కిడ్నీలో రాళ్లున్నట్టుగా గుర్తించారు. అయితే వీటిని గంటపాటు కీ హోల్ సర్జరీ చేసి వీటిని తొలిగించారు. రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రామ లక్ష్మయ్యను డిశ్చార్జి చేశారు. రామలక్ష్మయ్య గతంలో కూడా పలుమార్లు ఈ నొప్పి వచ్చేది.. స్థానిక హెల్త్ ప్రాక్టిషనర్ దగ్గర చికిత్సతో తాతాల్కిక ఉపశమనం పొందేవాడు.

కానీ ఈ సమస్య ఎక్కువ కావడంతో హైదరాబాదులోని ఆసుపత్రిలో చేరాడు. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలతో డీహైడ్రేషన్‌ కేసులు పెరుగుతున్నాయని, దీని ఫలితంగా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయని వైద్యులు అంటున్నారు.. వేసవికాలంలో ఎక్కువ నీరు, కొబ్బరి నీరు (వీలైతే) తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News