ఉద్యమంలో పాల్గొన్నవారిని దూరం పెట్టి...తిట్టినోళ్లను దగ్గరపెట్టుకున్నాడు కేసీఆర్: ఈటల

చీమలు పెట్టిన పుట్టలో ఎవరు చెరారో...తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని...మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

Update: 2021-07-09 10:30 GMT

చీమలు పెట్టిన పుట్టలో ఎవరు చెరారో...తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని...మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. తన రాజీనామాతోనే హుజూరాబాద్‌ నియోజకవర్గానికి.. ఎక్కడలేని నిధులు వస్తున్నాయన్న ఈటల... అభివృద్ధిపనుల వేగం పెంచారని తెలిపారు. నియోజకవర్గంలో బిజినెస్‌లు నడవాలంటే టీఆర్ఎస్‌ ఉండాలని స్థానికంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడ..ఎప్పుడు.. ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని ఈటల స్పష్టం చేశారు.

Tags:    

Similar News