రంగా రెడ్డి జిల్లా షాపూర్లో ఓ కుటుంబానికి చెందిన 8 మంది సభ్యులు వాగులో కొట్టుకుపోయారు. ఈ ఘటనలో ఏడుగురు సురక్షితంగా బయటపడగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. షాపూర్ తండాకు చెందిన దశరథ్.. తన కుటుంబంతో కలిసి ఉదయం పొలానికి వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో.. తన పిల్లలు, భార్య వాగులో కొట్టుకుపోయారు. దశరథ్ ఏడుగురు పిల్లలను రక్షించాడు. ఐతే.. భార్యను కూడా వాగు నుంచి బయటికి తీసుకొచ్చినా.. అప్పటికే ఆమె మృతి చెందింది.