హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ మీటింగ్ సొంత పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు ఆ పార్టీ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్. మజ్లిస్ ను చూసి కాంగ్రెస్ భయపడుతోందన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సమక్షంలో పార్టీని ప్రశ్నించారు ఫిరోజ్ ఖాన్. తనపై మజ్లిస్ దాడి చేస్తే పార్టీ, ప్రభుత్వం పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. ఫిరోజ్ ఖాన్ ఆరోపణలు కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారాయి.