FSL FIRE: అగ్ని ప్రమాదంలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు దగ్దం

ఫోరెన్సిక్ ల్యాబ్‌ను పరిశీలించిన డీజీ శిఖాగోయల్.. 7 మెటీరియల్స్ కాలిపోయాయన్న డీజీ శిఖాగోయల్... ఓటుకు నోటు కేసు మెటీరియల్ లేదని స్పష్టీకరణ

Update: 2026-02-08 10:00 GMT

నాం­ప­ల్లి­లో­ని ఫో­రె­న్సి­క్ ల్యా­బ్అ­గ్ని­ప్ర­మా­దం­పై వి­చా­రణ జరు­గు­తోం­ద­ని ఎఫ్‌­ఎ­స్‌­ఎ­ల్‌ డీజీ శి­ఖా­గో­య­ల్ వె­ల్ల­డిం­చా­రు. ఈ ప్ర­మా­దం­లో జరి­గిన ఆస్తి­న­ష్టం­పై అధి­కా­రు­లు అం­చ­నా­లు రూ­పొం­ది­స్తు­న్నా­ర­ని, నష్టం అం­చ­నా­కు వచ్చాక వి­వ­రా­లు వె­ల్ల­డి­స్తా­మ­న్నా­రు. ఇవాళ ఫో­రె­న్సి­క్ లా­బొ­రే­ట­రీ­స్‍ను పరి­శీ­లిం­చా­రు. అనం­త­రం మీ­డి­యా­తో మా­ట్లా­డు­తూ.. ని­న్న ఉదయం 10.08 గం­ట­ల­కు ఎఫ్ఎ­స్ఎ­ల్‌­లో అగ్ని­ప్ర­మా­దం జరి­గిం­ద­ని, మం­ట­ల­ను మొదట ఎఫ్ఎ­స్ఎ­ల్ ఉద్యో­గి ఒకరు గు­ర్తిం­చా­ర­ని చె­ప్పా­రు. ల్యా­బ్, ట్రై­నిం­గ్ హా­ల్‌­కు మం­ట­లు వ్యా­పిం­చా­య­ని, మం­ట­లు ఆర్పేం­దు­కు ప్ర­య­త్ని­స్తే సా­ధ్య­ప­డ­లే­ద­న్నా­రు. మొదట ప్రా­ప­ర్టీ రూ­మ్‌­లో పొగ, మం­ట­లు చె­ల­రే­గా­య­ని ఆ తర్వాత లై­బ్ర­రీ, హె­చ్ఆ­ర్ డీ రూ­మ్‌­కు వ్యా­పిం­చా­య­ని వె­ల్ల­డిం­చా­రు. ఈ ఘట­న­పై పో­లీ­సు­ల­కు ఫి­ర్యా­దు చే­శా­మ­న్నా­రు. అగ్ని­ప్ర­మా­దం సమ­యం­లో ఎవ­రు­న్నా­ర­నే దా­ని­పై ఆరా తీ­స్తు­న్న­ట్లు వె­ల్ల­డిం­చా­రు. అగ్ని­ప్ర­మా­దం నే­ప­థ్యం­లో ఓటు­కు నోటు కేసు, ఫోన్ ట్యా­పిం­గ్ కే­సు­ల­కు సం­బం­ధిం­చిన ఆధా­రా­లు కా­లి­పో­యా­య­ని జరు­గు­తు­న్న ప్ర­చా­రం­పై క్లా­రి­టీ ఇచ్చా­రు. 2024 పం­జా­గు­ట్ట పీ­ఎ­స్‍లో నమో­దైన ఫోన్ ట్యా­పిం­గ్ కే­సు­లో 136 మె­టీ­రి­య­ల్స్ ఎఫ్ఎ­స్ఎ­ల్‍కు వచ్చా­య­ని ఇం­దు­లో 7 మె­టీ­రి­య­ల్స్ తాజా ప్ర­మా­దం­లో కా­లి­పో­యా­య­ని చె­ప్పా­రు వీ­టి­ని రి­ట్రై­వ్ చే­స్తు­న్నా­మ­ని మి­గ­తా­వ­న్నీ సం­బం­ధింత అధి­కా­రు­ల­కు అప్ప­గిం­చా­మ­న్నా­రు. ఇక 2015లో ఏసీ­బీ నమో­దు చే­సిన ఓటు­కు నోటు కే­సు­కు సం­బం­ధిం­చిన మె­టీ­రి­య­ల్ ఎఫ్ఎ­స్ఎ­ల్ ల్యా­బ్‌­లో లే­ద­న్నా­రు. ఈ కే­సు­లో 2015లో రెం­డు వి­డ­త­ల్లో 16 మె­టీ­రి­య­ల్ ఆబ్జె­క్టు­లు ఎఫ్‌­ఎ­స్‌­ఎ­ల్‌­కు అం­దా­య­ని అదే సం­వ­త్స­రం వాటి ని­వే­ది­క­ల­ను ఏసీ­బీ కో­ర్టు­కు సమ­ర్పిం­చి­న­ట్టు చె­ప్పా­రు. ఈ కే­సు­కు సం­బం­ధిం­చిన 16 వస్తు­వు­లు ఇప్ప­టి­కే కో­ర్టు­కు తి­రి­గి అప్ప­గిం­చి­న­ట్టు తె­లి­పా­రు.

సంచలన విషయాలు వెలుగులోకి....

తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‍లో నిన్న జరిగిన అగ్నిప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై ఎఫ్ఎస్ఎల్ ఇన్‍స్పెక్టర్ శ్రీనివాస్ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలో కీలక విషయాలు పేర్కొన్నారు. 5 గదుల్లోని ఫైల్స్ కాలిపోయినట్లు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్‍తో పాటు కేసు వెరిఫికేషన్ చాంబర్, అనాలసిస్ చాంబర్ కాలిపోయాయని సర్వర్ రూమ్‍లో ఫైళ్లు దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. నిన్న ఉదయం సుమారు 10:08 గంటల సమయంలో తాను కార్యాలయానికి వెళ్తున్న సమయంలో కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పనిచేస్తున్న క్లాస్-IV ఉద్యోగి సాయి కృష్ణ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆనుకుని ఉన్న ప్రాపర్టీ రూమ్ (మొదటి అంతస్తు) లో మంటలు అంటుకుని అవి ఇతర గదులకు కూడా వ్యాపిస్తున్నాయని తనకు సమాచారం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే తాను ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇవ్వాలని సూచించానని పేర్కొన్నారు. అలాగే కార్యాలయంలో ఉండే అవకాశం ఉన్న ఇతర సిబ్బందిని కూడా సంప్రదించి సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని కోరానని అనంతరం తాను కూడా స్వయంగా కార్యాలయానికి బయలుదేరి10:25 గంటలకు అక్కడికి చేరుకున్నాని తెలిపారు.

Tags:    

Similar News