Ganesh Nimajjanam : పనిచేయని క్రేన్లు.. క్యూలోనే గణనాధులు..
Ganesh Nimajjanam : హైదరాబాద్ గణేష్ నిమజ్జనం రెండో రోజూ కొనసాగుతోంది
Ganesh Nimajjanam : హైదరాబాద్ గణేష్ నిమజ్జనం రెండో రోజూ కొనసాగుతోంది. ఇంకా వేలాది విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉండడంతో ఈ రాత్రి వరకు కొనసాగనుంది. దీనికి తోడు ఎన్టీఆర్ మార్గ్లో ఏర్పాటు చేసిన క్రేన్లలో కొన్ని మురాయిస్తుండడంతో నిమజ్జనం మరింత ఆలస్యమవుతోంది.
ఇందులో నాలుగు క్రేన్లు పనిచేయకపోవడంతో గణేష్ విగ్రహాలు వేలాదిగా బారులు తీరాయి. నిమజ్జనానికి ఆలస్యమవుతుండడంతో భక్తులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. వినాయక్ సాగర్లో నిమజ్జనానికి గణనాథులను తీసువచ్చిన నిర్వాహకులు... గంటలకొద్దీ నిరీక్షిస్తున్నారు.