బిగ్ బ్రేకింగ్.. స్వస్తిక్‌ ముద్ర మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి : హైకోర్ట్‌

Update: 2020-12-04 04:30 GMT

ఎన్నికల కమిషన్‌ సర్క్యూలర్‌ను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌లో స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈసీ సర్క్యులర్‌పై బీజేపీ హైకోర్టును ఆశ్రయించడంతో.. ఆ అభ్యంతరాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్‌ను మాత్రమే కౌంట్‌ చేయాలంది. తుది ఉత్తర్వులకు లోబడి ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Tags:    

Similar News