గ్రేటర్ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను ఖరారు చేసింది ఆ పార్టీ. మొత్తం 10 మందిని నియమించింది. వారిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు.. లక్ష్మణ్, మురళీదర్ రావు, వివేక్, గరికపాటి మోహన్రావు, రాజాసింగ్ (గోషామాల్ ఎమ్మెల్యే), ధర్మపురి అరవింద్ (నిజామాబాద్ ఎంపీ), రఘునందన్రావు (దుబ్బాక ఎమ్మెల్యే) లను బీజేపీ అధిష్టానం నియమించింది.