ఆపరేషన్ ఆకర్ష్‌..రేవంత్ అనుచరుల్లో కొందరిని పార్టీలో చేర్చుకున్న బీజేపీ

Update: 2020-11-21 12:32 GMT

గ్రేటర్‌ ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్ష్‌ను ముమ్మరం చేసింది బీజేపీ.పలు పార్టీలకు చెందిన అసంతృప్త నేతలపై కమలదళం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్‌ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ నేతలు. కిషన్‌రెడ్డి, బండిసంజయ్, లక్ష్మణ్‌ స్వయంగా స్వామిగౌడ్‌ను కలిశారు. అటు ఇప్పటికే బీజేపీతో టచ్‌లో ఉన్నారు కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ. రేవంత్ అనుచరుల్లోనూ కొందరిని పార్టీలో చేర్చుకున్నారు. అటు బీజేపీలో చేరుతున్నారంటూ వచ్చిన వార్తల్ని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు.


Tags:    

Similar News