గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్.. కూకట్‌పల్లి కౌంటింగ్ సెంటర్ వద్ద ఏజెంట్లు ఆందోళన

Update: 2020-12-04 07:03 GMT

కూకట్‌పల్లి కౌంటింగ్ సెంటర్ వద్ద ఏజెంట్లు ఆందోళనకు దిగారు. వివేకానందనగర్ డివిజన్‌లోని 63వ బూత్‌లో పోలైన ఓట్లలో తేడా రావడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల రోజు 574 ఓట్లు పోలయ్యాయని.. ఇప్పుడు 354 ఓట్లు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో బీజేపీ ఏజెంట్లు అధికారులను నిలదీశారు. సిబ్బంది సరైన సమాధానం చెప్పక పోవడంతో ఏజెంట్లు నిరసనకు దిగారు.

Tags:    

Similar News