హైదరాబాద్ నేరేడ్మెట్ డివిజన్ కౌంటింగ్కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అక్కడ వివాదాస్పదంగా మారిన ఇతర ముద్ర ఉన్న ఓట్లను కూడా లెక్కించాలని ఆదేశించింది. కోర్టు గత ఆదేశాల మేరకు కౌంటింగ్ నిలిచిపోయే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి 504 ఓట్ల మెజార్టీతో ఉండగా.. ఇతర ముద్ర ఉన్న గుర్తు ఓట్లు 544 గా నమోదయ్యాయి. తాజాగా కౌంటింగ్కు లైన్ క్లియర్ కావడంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది.