గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ, టీఆర్ఎస్ కొత్త నాటకానికి తెరతీసాయని PCC చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. నోట్ల రద్దు, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ లోపాయకారీగా ఏం చేస్తోందో అందరికీ తెలుసన్నారు. బండి సంజయ్ రాజకీయంగా ఏమాత్రం అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం సరికాదని హితవు పలికారు.